
- బోధన్ మున్సిపల్ కమిషనర్, అధికారులపై దళిత సంఘాల ఆగ్రహం
బోధన్, వెలుగు : అంబేద్కర్ జయంతి వేడుకలకు సరైన ఏర్పాట్లు చేయలేదని బోధన్ మున్సిపల్ కమిషనర్ వెంకట నారాయణపై దళిత సంఘాలు మండిపడ్డాయి. అధికారికంగా నిర్వహించాల్సిన వేడుకల విషయంతో నిర్లక్ష్యం చేసినందుకు కమిషనర్పై చర్యలు తీసుకోవాలని మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంపల్లి ఎల్లయ్య, దళిత సంఘాల నాయకులు ఉన్నతాధికారులను కోరారు. కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినా టెంట్లు, కుర్చీలు, మైక్ ఏర్పాటు చేయలేదన్నారు. వేడుకలకు రూ.50 వేలు కేటాయించామని, సబ్ కలెక్టర్ ఆదేశాల మేరకే ఏర్పాట్లు చేశామని మున్సిపల్ కమిషనర్ వెంకటనారాయణ తెలిపారు.
అంబేద్కర్ విగ్రహానికి నివాళి
బోధన్లోని అంబేద్కర్ విగ్రహానికి ఏసీపీ పి.శ్రీనివాస్, తహసీల్దార్ విఠల్, పట్టణ సీఐ వెంకట నారాయణ, కాంగ్రెస్ పీసీసీ డెలిగేట్ గంగాశంకర్, పట్టణ అధ్యక్షుడు పాషామోయినొద్దీన్, డీసీసీబీ డైరెక్టర్ గిర్దవార్ గంగారెడ్డి, మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త శరత్ రెడ్డి, దళిత నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు.