గడువులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించండి : దాన కిషోర్

గడువులోగా  ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించండి : దాన కిషోర్

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: నిర్దిష్ట గడువులోగా ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించాలని మున్సిపల్​అడ్మినిస్ట్రేషన్ అండ్ పట్టణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ అన్నారు. సోమవారం ఆయన సీడీఎంఏ వీపీ గౌతమ్​తో కలిసి హైదరాబాద్ నుంచి అడిషనల్​కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్ఆర్ఎస్, స్వయం సహాయక మహిళా బృందాల బ్యాంక్ లింకేజీ​లో పురోగతి, మహిళ శక్తి క్యాంటీన్లు, స్వచ్ఛదనం–పచ్చదనం, వీధి కుక్కల వల్ల ముప్పు తదితర అంశాలపై సమీక్షించారు. 

అనంతరం బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే మాట్లాడుతూ ఏబీసీ కేంద్రం అందుబాటులో ఉందని ఇక్కడ ప్రతి నిత్యం 25-30 వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు జరుగుతున్నాయన్నారు. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ల ఏర్పాటు చేయడంతోపాటు వారంలోగా 5 క్యాంటీన్ లు ప్రారంభించనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకు రూ.47 కోట్ల రుణం అందించామన్నారు. కార్యక్రమంలో సీపీ రవీంద్ర, సీఎంహెచ్ వో రాజేష్, హెచ్ వో రమేశ్, టీపీఆర్ వో కోలా రాజేశ్​కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.