రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు ఆ ట్రైన్ క్యాన్సిల్

రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. రెండు రోజులు ఆ ట్రైన్ క్యాన్సిల్

హైదరాబాద్: ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే బిగ్ అప్డేట్ ఇచ్చింది. ట్రాక్ మెయింటెనెన్స్ కారణంగా రెండు రోజుల పాటు దానాపూర్ ఎక్స్‎ప్రెస్ ట్రైన్‎ను రద్దు చేస్తున్నట్లు మంగళవారం (ఫిబ్రవరి 18) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఫిబ్రవరి 19న సికింద్రాబాద్ నుంచి దానాపూర్ వెళ్లునున్న దానాపూర్ ఎక్స్‎ప్రెస్ (12791)ను రద్దు చేసినట్లు తెలిపింది.

అలాగే.. ఫిబ్రవరి 21న దానాపూర్ నుంచి సికింద్రాబాద్ రావాల్సిన దానాపూర్ ఎక్స్‎ప్రెస్ (12792)ను క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని విజ్ఞప్తి చేసింది. ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలని ప్రయాణికులకు సూచించింది. ట్రాక్ మెయింటెనెన్స్, నిర్వహణ పనులు పూర్తి అయిన వెంటనే తిరిగి యథావిధిగా రైలు సర్వీసును పునరుద్ధరిస్తామని తెలిపింది.