
- మనుషుల విసర్జితాలతో మొక్కల్లోకి..
- టమాట, మిర్చి, క్యారెట్, మెంతి, కొత్తిమీర తదితరాల్లో ఆనవాళ్లు
- ఐసీఎంఆర్ స్టడీలో వెల్లడి
హైదరాబాద్, వెలుగు : ఆకు కూరలు, కూరగాయల్లోనూ ప్రమాదకరమైన బ్యాక్టీరియాలు, యాంటీబయాటిక్స్ఆనవాళ్లు ఉన్నట్టు ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) స్టడీలో తేలింది. మన కడుపులో ఉండే ప్రమాదకరమైన ఈకొలి రకం బ్యాక్టీరియాలతో పాటు పలు యాంటీబయాటిక్స్అవశేషాలూ ఉన్నట్టు వెల్లడైంది.
మధ్యప్రదేశ్లోని ఐసీఎంఆర్అనుబంధ సంస్థ నేషనల్ ఇనిస్టిట్యూట్ఫర్ రీసెర్చ్ ఇన్ ఎన్విరాన్మెంటల్ హెల్త్, రాజస్థాన్లోని సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ఆఫ్ లైఫ్ సైన్సెస్, హర్యానాలోని అగ్రికల్చర్యూనివర్సిటీలు సంయుక్తంగా చేసిన స్టడీలో ఈ విషయాలన్నీ వెల్లడయ్యాయి. టమాట, పచ్చి మిర్చి, క్యారెట్, దోస, ర్యాడిష్, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, పుదీనా, ఉల్లిపోచలు, క్యాబేజీ వంటి వాటిల్లో యాంటీబయాటిక్స్, ఈకొలై బ్యాక్టీరియాల ఆనవాళ్లు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి 1,780 శాంపిళ్లను సేకరించి.. వాటిలో ఉన్న బ్యాక్టీరియాల ప్రమాదస్థాయి, డ్రగ్రెసిస్టెన్స్, యాంటీబయాటిక్స్అవశేషాలపై స్టడీ చేశారు. మన మూత్రనాళ వ్యవస్థను డ్యామేజ్చేసే యూరోపాథోజెనిక్ఈకొలై స్ట్రెయిన్స్తో పాటు ఒంటిని సెప్టిక్చేసే సెప్టిసీమియా ఈకొలై స్ట్రెయిన్స్ఉన్నట్టు నిర్ధారించారు.
ఈ యాంటీబయాటిక్స్కు రెసిస్టెన్స్..
ఆయా బ్యాక్టీరియాలు ఉన్న కూరగాయలను తినడం వల్ల బ్యాక్టీరియాల డ్రగ్రెసిస్టెన్స్ప్రమాదకర స్థాయికి చేరుతున్నదని సైంటిస్టులు హెచ్చరించారు. ఈ కూరగాయల్లోని బ్యాక్టీరియా స్ట్రెయిన్లు వంద శాతం వరకు మల్టీ డ్రగ్రెసిస్టెన్స్(వివిధ యాంటీబయాటిక్స్కు నిరోధకత)ను సంతరించుకున్నాయని తేల్చారు. క్లోరాంఫెనికాల్, కోలిస్టిన్తో పాటు ఫ్రంట్లైన్యాంటీ బయాటిక్స్అయిన నైట్రోఫ్యురాంటాయిన్, సల్ఫామీథాక్సజోల్, యాంపిసిలిన్, జెంటామైసిన్తదితర యాంటీబయాటిక్స్కు రెసిస్టెన్స్ను సంతరించుకున్నాయని హెచ్చరించారు. మొత్తంగా కూరగాయల నుంచి సేకరించిన శాంపిళ్లలో 77 రకాల బ్యాక్టీరియా వర్గాలు ఉన్నట్టు నిర్ధారించారు. అత్యధికంగా క్యారెట్లోనే 25 శాతం వరకు బ్యాక్టీరియా రకాలు ఉన్నాయని తేల్చారు. ఆ తర్వాత క్యాబేజీలో 19.3 శాతం, మెంతిలో 18.5, టమాటలో 15.9, కొతిమీరలో 15.7, పాలకూరలో 15.2, పచ్చిమిర్చిలో 14.5, దోసలో 14.4, పుదీనాలో 12, ఉల్లిపోచల్లో 8.1 శాతం మేర ఆ బ్యాక్టీరియాల స్ట్రెయిన్స్ఉన్నాయని వెల్లడించారు.
మూత్రనాళ ఇన్ఫెక్షన్లు..
ఈ బ్యాక్టీరియా స్ట్రెయిన్లు ఉన్న కూరగాయలను తింటే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, బ్లడ్ ఇన్ఫెక్షన్లు వస్తాయని సైంటిస్టులు హెచ్చరిస్తున్నారు. ఇన్నాళ్లూ చికెన్ వంటి మాంసాహారాల్లోనే వీటి ఆనవాళ్లు ఉన్నాయని గుర్తించినా.. ఇప్పుడు శాకాహారాలైన కూరగాయలనూ అవి రిజర్వాయర్లుగా చేసుకుంటున్నాయని చెబుతున్నారు. ఎక్కువగా మనుషులు విసర్జించే మలం ద్వారానే అవి కూరగాయల మొక్కల్లోకి చేరుతున్నాయని అంటున్నారు. పెస్టిసైడ్స్ను ఎక్కువగా చల్లడం వల్ల కూడా యాంటీబయాటిక్స్అవశేషాలు కూరగాయల్లోకి చేరుతున్న దాఖలాలున్నాయని చెబుతున్నారు.
మరోవైపు చిన్నపిల్లల్లో మెదడువాపుకు కారణమయ్యే నియోనేటల్మెనింజైటిస్ ఈకొలై స్ట్రెయిన్స్కూడా పలు కూరగాయల్లో ఉన్నట్టు హెచ్చరించారు. ఈ బ్యాక్టీరియాలు కూరగాయల ద్వారా ఎంతమేర యాంటీబయాటిక్స్రెసిస్టెన్స్ సంతరించుకుంటున్నాయన్న దానిపై స్టడీ చేయాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు చెబుతున్నారు.