
- డీఏవో సురేశ్ కుమార్
ములుగు, వెలుగు: ములుగు జిల్లాలో మొక్కజొన్న విత్తనోత్పత్తికి సంబంధించి నష్టపోయిన రైతుల జాబితాను ఆయా జీపీ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రదర్శించామని, పేర్లను రైతులు సరిచూసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వి. సురేశ్ కుమార్ ఒక ప్రకటనలో సూచించారు.
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో క్షేత్ర పరిశీలన చేసి నష్టపోయిన రైతుల జాబితాను రూపొందించి ఆయా కార్యాలయాల్లో వారం రోజులపాటు ప్రదర్శిస్తామన్నారు. ఈ జాబితాలో ఎవరైనా అనర్హులు ఉన్నట్లయితే వ్యవసాయ శాఖ దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లా కలెక్టర్ సంబంధిత విత్తన కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి రైతులకు నష్టపరిహారం ఇప్పించేందుకు చర్యలు తీసుకుంటారని, రైతులు సహకరించాలని కోరారు.