
ఉప్పల్, వెలుగు: ఉప్పల్లో డ్రగ్ కంట్రోల్ అధికారులు (డీసీఏ) బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. లక్ష్మీనారాయణ నగర్ కాలనీలో డ్రగ్ లైసెన్స్ లేకుండా గోడౌన్ నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో ఈ తనిఖీలో చేపట్టారు. ఈ గోడౌన్ లో ఆరు రకాల గడువు ముగిసిన ఔషధాలను గుర్తించి, సీజ్ చేశారు. వీటి విలువ రూ.6.70 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు.
అద్దంకి వెంకటేష్, సురేశ్ బాబు అనే ఇద్దరు వ్యక్తలు ఈ గోడౌన్ నిర్వహిస్తున్నట్లు గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో డీసీఏ అసిస్టెంట్ డైరెక్టర్ (షామీర్పేట) అంజూమ్ అబిదా, ఉప్పల్, షామీర్పేట, మేడిపల్లి డ్రగ్ ఇన్స్పెక్టర్లు డాక్టర్ బి.లక్ష్మినారాయణ, బి.ప్రవీణ్,
పి.అంబేద్కర్ పాల్గొన్నారు.