మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి : డీసీసీ ప్రెసిడెంట్​ నర్సారెడ్డి 

మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవి : డీసీసీ ప్రెసిడెంట్​ నర్సారెడ్డి 

గజ్వేల్, వెలుగు: మన సంస్కృతీ, సంప్రదాయాలు ఎంతో గొప్పవని, వాటిని ప్రతి ఒక్కరూ పాటించాలని డీసీసీ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి అన్నారు. సోమవారం గజ్వేల్​ పట్టణంలో నిర్వహించిన కైట్​ఫెస్టివెల్​లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని పతంగులు ఎగురవేశారు.

ఈ సందర్భంగా నర్సారెడ్డి మాట్లాడుతూ.. వేల సంవత్సరాలు గడుస్తున్నా మన సంప్రదాయాలు చెక్కుచెదరకుండా ఉండడానికి పండుగలే కారణమన్నారు. కార్యక్రమంలో యూత్​కాంగ్రెస్​ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, ఏఎంసీ చైర్మన్ నరేందర్​రెడ్డి, వైస్​చైర్మన్​సర్ధార్​ఖాన్, నాయకులు రంగారెడ్డి, భూమ్​రెడ్డి పాల్గొన్నారు.