
ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లాలో బీఆర్ఎస్కు షాక్ తగిలింది. ఆ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఉమ్మడి జిల్లా డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి వెల్లడించారు. శనివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్లో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్క్షతలు తెలియాజేశారు. త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని పేర్కొన్నారు. కాగా ఆయన కాంగ్రెస్లో చేరబోతున్నట్లు తెలుస్తోంది.