సంగారెడ్డి బీఆర్ఎస్​ అభ్యర్థిని మార్చాల్సిందే: మాణిక్యం

సంగారెడ్డి బీఆర్ఎస్​ అభ్యర్థిని మార్చాల్సిందే: మాణిక్యం

కంది, వెలుగు :  సంగారెడ్డి బీఆర్ఎస్​ అభ్యర్థిని మార్చాల్సిందేనని డీసీసీబీ వైస్​ చైర్మన్​పట్నం మాణిక్యం డిమాండ్​ చేశారు. ఆదివారం సంగారెడ్డిలోని శిల్పారామంలో ఏర్పాటు చేసిన పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కార్యకర్తలు నిరాశకు గురి కావొదు..  సంగారెడ్డిలో బీఆర్​ఎస్​ టికెట్​ సాధించి సీఎం కేసీఆర్​కు గులుపును గిఫ్ట్ ఇవ్వడానికి అందరూ సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. 

ఆరోగ్యం సరిగా లేని వ్యక్తికి టికెట్​ ఇస్తే ఎలా గెలుస్తాడని విమర్శించారు. సంగారెడ్డి టికెట్​విషయంలో సీఎం కేసీఆర్ పునరాలోచించుకోవాలని,  ఇక్కడ టికెట్​ఆశిస్తున్న వారిలో  ఎవరికి ఇచ్చినా కలిసి పనిచేస్తామని తెలిపారు. సమావేశంలో కొండాపూర్​ ఎంపీపీ మనోజ్​రెడ్డి, వైఎస్​ఆర్​ టీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీధర్​రెడ్డి, మల్లేశం, కార్యకర్తలు పాల్గొన్నారు.