
హైదరాబాద్ లోని హబ్సిగూడ సిగ్నల్ దగ్గర డీసీఎం బీభత్సం సృష్టించింది. బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి సిగ్నల్ దగ్గర ఆగి ఉన్న మరో మూడు బైకులపై వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.
మార్చి 24న సోమవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్తో పాటు బైకులపై ఉన్న నలుగురికి గాయాలు అయ్యాయి . బైక్పై ఉన్న ఒక మహిళకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
Also Read : హైదరాబాద్ ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం
ఘటన జరిగిన సమయంలో ఒక వ్యక్తి తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. అయితే, అతని బైక్ పూర్తిగా ధ్వంసమైంది. ఈఘటనలో కాసేపు భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.