ఉధృతంగా రాళ్లవాగు.. కొట్టుకుపోయిన డీసీఎం..ముగ్గురు గల్లంతు

ఉధృతంగా రాళ్లవాగు.. కొట్టుకుపోయిన డీసీఎం..ముగ్గురు గల్లంతు

మహబూబాబాద్ జిల్లాలో రాళ్ల వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.. ఆదివారం (సెప్టెంబర్ 1)న కురిసిన వర్షాలతో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహించింది. మహబూబాబాద్ ము న్సిపాలిటిలోని ఈదుల పూసపెల్లి వద్ద  రాళ్లవాగు ఉప్పొంగడంతో  డీసీఎం లారీ కొట్టుకుపోయింది.. డీసీఎంలో నలుగురు వ్యక్తులున్నట్లు ఉన్నారు. గల్లంతయిన నలు గురి కోసం సహాయక చర్యలు చేపట్టారు.. 

డిసిఎం వరద ఉదృతికి వాగులో కొట్టుకుపోతున్న క్రమంలో సమీపంలోని చెట్టుకు తట్టుకుని ఆగడంతో  వెనుక నిలిచి ఉన్న వారంత డిసిఎం క్యాబిన్​ పట్టుకు వేలాడ డంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. డిఎస్పీ తిరుమల రావు,మహబూబాబాద్​  టౌన్​ సీఐ దేవేందర్​ ఆధ్వర్యంలో అగ్నిమాపక సిబ్బం ది, పోలీసులు అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.  

సీబి,బోటు ద్వారా వారి కాపాడే ప్రయత్నం చేశారు. తాడు పట్టుకుని వస్తున్న క్రమంలో ఒ వ్యక్తి పట్టు తప్పి  వాగులో కొట్టుకుపోయాడు. మిగిలిన ముగ్గురిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు.. చీకటిలోనే సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.