
- వచ్చే నెల 6 వరకు అవకాశం
హైదరాబాద్, వెలుగు: బీసీ గురుకుల పాఠశాలల్లో 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ కోసం ఆన్లైన్ అప్లికేషన్లు సమర్పించేందుకు గడువును వచ్చే నెల 6 వరకు పొడిగిస్తున్నట్టు సెక్రటరీ సైదులు చెప్పారు. అప్లికేషన్ల గడువు మార్చి 31తో ముగియనుండగా ఏప్రిల్ 6 వరకు దానిని పొ డిగించామని ఆదివారం పత్రిక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో మొత్తం బ్యాక్లాగ్ సీట్లు 6,832 ఉన్నాయి. ఈ సీట్ల భర్తీ కోసం వచ్చే నెల 20న ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లను కేటాయించనున్నారు. అర్హులైన విద్యార్థులు ఏప్రిల్ 6లోగా www.mjptbcwreis.telangana.gov.in, https://mjptbcadmissions.org వెబ్సైట్లలో దరఖాస్తు చేసుకోవాలని సెక్రటరీ సూచించారు.