
న్యూఢిల్లీ: విమానాల్లో వాడే ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటీఎఫ్) ధర 1.5 శాతం, హోటళ్లలో, రెస్టారెంట్లలో వాడే కమర్షియల్ఎల్పీజీ సిలిండర్ (19 కేజీలు) ధర రూ.14.50 తగ్గింది. ఢిల్లీలో కిలోలీటర్ ఏటీఎఫ్ ధర రూ.1,401 తగ్గి రూ.90,455కి పడిపోయింది. ముంబైలో ధర రూ.84,511కు దిగివచ్చింది. అయితే గత ఏడాది నవంబరు, డిసెంబరులో దీని ధరలు పెరిగాయి. వరుసగా ఐదు నెలలు కమర్షియల్ఎల్పీజీ ధరలను పెంచిన కేంద్రం ఈసారి మాత్రం ధర తగ్గించడంతో ప్రస్తుతం దీని ధర ముంబైలో రూ.1,756 కాగా, కోల్కతాలో రూ.1,911, కోల్కతాలో రూ.1,966 ఉంది. ఏటీఎఫ్, ఎల్పీజీ ధరలు ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటాయి. ఇంటి అవసరాలకు వాడే సాధారణ 14.2 కేజీల సిలిండర్ ధర మాత్రం మారలేదు.