​​​​​​​దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత

​​​​​​​దేశంలో తగ్గుతున్న కరోనా తీవ్రత

న్యూఢిల్లీ : దేశంలో కరోనా తీవ్రత తగ్గుతోంది. రోజు రోజుకూ కొత్త కేసులు, మరణాలు తగ్గుతున్నాయి. యాక్టివ్ కేసులు 15 లక్షల కిందకు చేరాయి. గత 24 గంటల్లో కొత్తగా లక్షా 14 వేల 460 కేసులు రికార్డయ్యాయి. 2 వేల 677 మంది చనిపోయారు. కరోనా నుంచి కోలుకొని నిన్న లక్షా 89 వేల 232 మంది డిశ్చార్జ్ అయ్యారు.  దేశంలో మొత్తం కరోనా కేసులు 2 కోట్ల 88 లక్షల 9 వేల 339కు చేరాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశవ్యాప్తంగా 14 లక్షల 77 వేల 799 యాక్టివ్ కేసులున్నాయని ప్రకటించింది. ఇప్పటివరకు కరోనాతో 3 లక్షల 46 వేల 759 మంది చనిపోయారన్నారు అధికారులు. రికవరీ రేట్ 93.67 శాతం, డెత్ రేట్ 1.2 శాతం ఉందని చెప్పారు. ఇప్పటివరకు 2 కోట్ల 13 లక్షల 22, 417 మందికి టీకాలు వేశామని తెలిపారు.