రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు

రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ: లిక్కర్ స్కాం కేసులో సీబీఐ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. కేసు విచారణలో భాగంగా తీహార్ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. కాగా ఈడీ కేసులో కేజ్రీవాల్ బెయిల్ లభించినా.. సీబీఐ కేసులో మాత్రం బెయిల్ రాకపోవడంతో ఆయన ఇంకా జైలులోనే ఉన్నారు.