ఢిల్లీ సీఎం నివాసానికి సీల్

ఢిల్లీ సీఎం నివాసానికి సీల్

అక్రమ వినియోగం ఆరోపణలపై ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి అధికారిక నివాసాన్ని పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పిడబ్ల్యుడి) విభాగం బుధవారం(అక్టోబర్ 09) సీల్ చేసింది. గత వారం రోజుల వరకు ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆయన సీఎం పదవికి రాజీనామా చేయడంతో దానిని ఖాళీ చేశారు. 

కేజ్రీవాల్ అనంతరం ఢిల్లీ సీఎంబాధ్యతలు చేప్పట్టిన అతిషి అదే నివాసానికి మారగా.. పీడబ్ల్యూడీ అధికారులు ఆమె వస్తువులను అక్కడినుండి మరొకచోటకి తరలించారు. 

ALSO READ | జమిలి ఎన్నికలు పెడితే నష్టమేంటి ? : సీఎం చంద్రబాబు

ముఖ్యమంత్రి నివాసం నుండి అతిషికి చెందిన అన్ని వస్తువులను ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తొలగించారని ఢిల్లీ సిఎంఓ పేర్కొంది. ఆ ఇంటిని ఓ బీజేపీ నాయకుడికి కేటాయించాలని గవర్నర్ ఒత్తిడి తెస్తున్నందునబీజేపీ ఆదేశాల మేరకు బలవంతంగా ఖాళీ చేయబడ్డారని సిఎంఓ ఒక ప్రకటనలో తెలిపింది. గత 27 ఏళ్లుగా ముఖ్యమంత్రులకు నివాసయోగ్యంగా ఉన్న ఇంటిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని సీఎంఓ పేర్కొంది.