
ఢిల్లీని భూకంపం వణికించింది. సోమవారం (ఫిబ్రవరి 17) తెల్లవారుజామున భూమి కంపించడంతో జనాలు ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5.30 గంటల ప్రాంతంలో వచ్చిన భూకంపానికి నిద్ర లేచిన జనం భయంతో ఇండ్ల నుంచి బయటకు వచ్చారు. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూకంపం సంభవించడం రాజధాని ప్రజలను భయాందోళనలకు గురి చేసింది.
ఢిల్లీలో 5 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భూకంపంతో ఇళ్లల్లోని వస్తువులు కదలటం, కిందకు పడిపోవడంతో జనాలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఢిల్లీ భూకంపంపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఢిల్లీ ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు. భూకంపం వచ్చిన సందర్భంలో జాగ్రత్త చర్యలు తప్పకుండా పాటించాలని పిలుపునిచ్చారు.
Just Look at the Blast and Wave it was something else still thinking about it
— Mahiya18 (@mooniesssoobin) February 17, 2025
My Home CCTV video #earthquake #Delhi pic.twitter.com/AiNtbIh9Uc
ఢిల్లీని వణికిస్తున్న వరుస భూకంపాలు:
జనవరి 7, 2025:
ఢిల్లీని వరుస వణికిస్తున్నాయి. 2025, జనవరి 7న రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రతతో టిబెట్ క్సిజాంగ్ ఏరియాలో వచ్చిన భూకంపంతో ఢిల్లీలో కూడా ప్రకంపనలు రావడంతో ఢిల్లీ ప్రజలు ఆందోళనకు గురయ్యారు.
డిసెంబర్ 26, 2024:
హర్యాణాలో 2.6 తీవ్రతతో డిసెంబర్ 26, 2024లో వచ్చిన భూకంపంతో ఢిల్లీ వణికిపోయింది.
డిసెంబర్ 25, 2024:
హర్యాణాలో 3.5 తీవ్రతతో వచ్చిన భూకంపంతో ఢిల్లీ షేక్ అయ్యింది.
సెప్టెంబర్ 11, 2024:
పాకిస్తాన్ లో సెప్టెంబర్ 11, 2024లో వచ్చిన భూకంపం ఢిల్లీని భయపెట్టింది. 5.8 తీవ్రతతో వచ్చిన భూకంప ప్రభావంపై కూడా పడింది.
ఆగస్టు 29, 2024:
ఆఫ్ఘనిస్తాన్ లో ఆగస్టు 29, 2024 సంభవించిన 5.7 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చిన ఎర్త్ క్వేక్ ఢిల్లీని మరోసారి వణికించింది.
రాజధాని చుట్టు పక్కల ఏర్పడిన భూకంపాలతో ఢిల్లీ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా తెల్లవారుజామున వచ్చిన భూకంపం మరోసారి ఢిల్లీని వణికించింది.