సీబీఐ కేసులో కోర్టు ముందుకు కవిత

సీబీఐ కేసులో కోర్టు ముందుకు కవిత

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో సీబీఐ దాఖలు చేసిన సప్లమెంటరీ చార్జ్ షీట్ పై విచారణను రౌస్ ఎవెన్యూ కోర్టు మరోసారి వాయిదా వేసింది. సీబీఐ చార్జ్ షీట్ లోని కొన్ని పేజీలను తెలుగు నుంచి ఇంగ్లీష్ లోకి అనువాదించి ఇవ్వాలని సీబీఐ అధికారులను గతంలో కోర్టు ఆదేశించింది. అయితే అప్ డేట్ చేసిన కాపీలను దర్యాప్తు సంస్థ నిందితులకు అందించేందుకు మరికొంత సమయం కోరింది. దీంతో తదుపరి విచారణను అక్టోబర్ 19 కి వాయిదా వేస్తున్నట్టు ట్రయల్ కోర్టు వెల్లడించింది. ఈ కేసు వ్యవహారంలో జూన్ 7న కవితతో పాటు, మరో నలుగురిపై సప్లమెంటరీ చార్జ్ షీట్ దాఖలు చేసింది. ఈ చార్జ్ షీట్ ను జులై 22న కోర్టు పరిగణనలోకి తీసుకుంది.