ఏం ఐడియారా బాబూ : రూ.500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ APP స్కాంలో బాలీవుడ్ నటి..!

ఏం ఐడియారా బాబూ : రూ.500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ APP స్కాంలో బాలీవుడ్ నటి..!

ఈ మధ్య కాలంలో కొందరు కేటుగాళ్ళు అధిక లాభాల ఆశ చూపించి ఆన్ లైన్ యాప్స్ ద్వారా ఆర్ధిక నేరాలకి పాల్పడుతున్నారు. తమ సంస్థలో పెట్టుబడులు పడితే తక్కువ సమయంలో రెండింతలు, మూడింతలు లాభాలు పొందవచ్చని నమ్మబలికి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. అయితే ఇలాంటి యాప్స్ ప్రమోషన్స్ చేసినందుకు ఇటీవలే బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రియా చక్రవర్తికి పోలీసులు సమన్లు జారీచేశారు. 

పూర్తీ వివరాల్లోకి వెళితే గత కొద్దిరోజులుగా HIBOX యాప్‌ లో పెట్టుబడులు పెడితే తక్కువ సమయంలోనే ఎక్కువ లాభాలు పొందవచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఇన్‌ఫ్లుయెన్సర్స్, సినీ ప్రముఖులు, యూట్యూబర్‌లు తదితరులు HIBOX యాప్‌ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు. 
దీంతో దాదాపుగా 30,000 మంది ఈ HIBOX యాప్‌ లో డబ్బు ఇన్వెస్ట్ చేశారు. 

కానీ లాభాలు చెల్లించే క్రమంలో HIBOX యాప్‌ అధికారులు ఫెయిల్ అవ్వడంతో డబ్బు ఇన్వెస్ట్ చేసినవారు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో ఈ నెల ప్రారంభం నుంచి ఇప్పటివరకూ దాదాపుగా 500 కి పైగా ఫిర్యాదులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు HIBOX యాప్‌ సంస్థ అధికారులపై కేసులు నమోదు చేసి విచారిస్తున్నారు. 

ఈ క్రమంలో HIBOX యాప్‌ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసిన వారిని పిలిచి విచారిస్తున్నారు. దీంతో నటి రియా చక్రవర్తి ని విచారణకి హాజరు కావాలని డిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. అయితే ఈ స్కామ్ విలువ దాదాపుగా రూ. 500 కోట్లు ఉన్నట్లు సమాచారం.