ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌.. సిక్సర్ల వర్షం కురిపించిన ఆయుష్ బదోనీ

ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌.. సిక్సర్ల వర్షం కురిపించిన ఆయుష్ బదోనీ

న్యూఢిల్లీ: ఐపీఎల్‌‎‌తో వెలుగులోకి వచ్చిన యంగ్ క్రికెటర్‌‌‌‌‌ఆయుష్ బదోనీ, మరో కుర్రాడు ప్రియాన్ష్‌‌‌‌ఆర్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌‎లో సిక్సర్ల మోత మోగించారు. సౌత్‌‌‌‌ ఢిల్లీకి ఆడుతున్న  బదోనీ టీ20 మ్యాచ్‌‎లో అత్యధికంగా 19 సిక్సర్లు కొట్టి రికార్డు సృష్టించగా.. ఆర్య ఆరు బాల్స్‌‌‌‌కు ఆరు సిక్సర్లు కొట్టి ఔరా అనిపించాడు. శనివారం జరిగిన మ్యాచ్‌‌‌‌లో  బదోనీ ( 55 బాల్స్‌‎లో19 సిక్సర్లు, 8 ఫోర్లతో  165), ఆర్య (50 బాల్స్‌‌‌‌లో 10 సిక్సర్లు, 10 ఫోర్లతో 120) మెరుపు సెంచరీలతో రెండో వికెట్‌కు 286 రన్స్ జోడించాడు.  టీ20ల్లో ఏ వికెట్‌‌‌‌కైనా ఇదే హయ్యెస్ట్ పార్ట్‌‌‌‌నర్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌. వీళ్ల జోరుకు 308/5 స్కోరు చేసిన సౌత్ ఢిల్లీ 112 రన్స్ తేడాతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్‌‌‌‌ను చిత్తు చేసింది.