ఢిల్లీకి నీటి కొరత.. యమునా నదిలో కాలుష్యంతో నిలిచిన నీటి సరఫరా

ఢిల్లీకి నీటి కొరత.. యమునా నదిలో కాలుష్యంతో నిలిచిన నీటి సరఫరా

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని నీటికొరత వేధిస్తున్నది. యమునా నదిలో అమ్మోనియా సాంద్రత పెరగడంతో నీటి సరఫరా నిలిచిపోయింది. నవంబర్​ 1 వరకు ఉత్తర, ఈశాన్య, దక్షిణ ఢిల్లీ, న్యూఢిల్లీ మున్సిపల్​ కౌన్సిల్​ పరిధిలోని ప్రాంతాలకు సమస్య ఉంటుందని  ఢిల్లీ జల్ బోర్డు పేర్కొంది. 

ఉత్తరప్రదేశ్​లోని మురాద్​నగర్​ ఎగువ గంగా కాలువ వార్షిక మరమ్మతుల కారణంగా దీనిపైన ఉన్న భగీరథి, సోనియా విహార్​ వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్లకు నీటి సరఫరాను నిలిపేశారని తెలిపింది. ఇప్పుడు ఈ వాటర్  ​ట్రీట్​మెంట్​ ప్లాంట్లు యమునా నదిపైనే ఆధారపడి ఉన్నాయని,  కానీ ఈ నీటిలో 1.5 పీపీఎం కంటే ఎక్కువ అమ్మోనియా ఉండడంతో నీటి శుద్ధి కష్టతరంగా మారిందని పేర్కొన్నది. ఢిల్లీ ప్రజలు అవసరాల మేరకే నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించింది.