
కూసుమంచి, వెలుగు : అసైడ్భూమిలో అక్రమ కట్టడాలను రెవెన్యూ అధికారులు మంగళవారం తొలగించారు. కుసుమంచి తహసీల్దారు సురేశ్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని నాయకన్గూడెం గ్రామంలో హైవే పక్కన ఈద్గా స్థలాన్ని ఓ ప్రజాప్రతినిధి ఆక్రమించినట్లు ముస్లింలు అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో సర్వే చేపట్టిన రెవెన్యూ అధికారులు మంగళవారం అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సురేశ్కుమార్, ఆర్ఐలు రాము, లింగమూర్తి, సర్వేయర్ రవికుమార్, సీఐ జనార్దన్, ఎస్సై కిరణ్కుమార్ పాల్గొన్నారు.