
పాన్గల్, వెలుగు: సైన్స్ ఫేర్లో పాల్గొన్న ప్రతి విద్యార్థి సైంటిస్టు కావాలని జిల్లా ఎడ్యుకేషన్ఆఫీసర్అబ్దుల్ ఘనీ అన్నారు. మంగళవారం తెల్లరాళ్లపల్లిలోని లిటిల్ స్టార్ హై స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించారు. డీఈవో ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు చదువుకోవడంతో పాటు ఇలాంటి సైన్స్ఫేర్లలో పాల్గొనడం ద్వారా ప్రాక్టికల్గా సబ్జెక్టులను తెలుసుకోగలుగుతారని అన్నారు.
స్టూడెంట్లు శ్రద్ధగా చదువుకొని టీచర్లకు, తల్లిదండ్రులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని అన్నారు. కార్యక్రమంలో స్కూల్కరస్పాండెంట్ఆంజనేయులు, ఎంఈఓ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ముంత శేఖర్, ట్రస్మ నాయకులు ప్రకాశ్ బాబు, జేవీవీ జితేందర్ గౌడ్, రచయిత జన జ్వాల తదితరులు పాల్గొన్నారు.