
నిజామాబాద్, వెలుగు : గ్రామ పంచాయతీ ఎలక్షన్ ట్రైనింగ్కు గైర్హాజరైన ఆరుగురు టీచర్లకు మంగళవారం డీఈవో అశోక్ షోకాజ్నోటీసులు జారీ చేశారు. కలెక్టర్ రాజీవ్గాంధీ హనుమంతు ఆదేశాల మేరకు ధర్మారం జడ్పీ హై స్కూల్ హెచ్ఎం సంధ్యానాయక్(ధర్మారం- బి), జడ్పీ స్కూల్ అసిస్టెంట్లు లక్ష్మీనాథం(ఇందల్వాయి), నారాయణ(ఘన్పూర్), హుస్సేని బుకారి (డిచ్పల్లి రైల్వే స్టేషన్), జి.సాయిలు (సాలూరా), స్వామి (జాకోరా)లకు నోటీసులు పంపారు. రెండు రోజుల్లో సంజాయిషీ ఇవ్వాలని లేకపోతేయాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు.