1,321 ఎస్జీటీలకు ట్రాన్స్​ఫర్ ..  వెబ్​ ఆప్షన్​లతో ప్రక్రియ పూర్తి

1,321 ఎస్జీటీలకు ట్రాన్స్​ఫర్ ..  వెబ్​ ఆప్షన్​లతో ప్రక్రియ పూర్తి
  •  ప్రమోషన్​ తర్వాత  ఏర్పడిన ఖాళీలు ఫిలప్​

నిజామాబాద్, వెలుగు: ఎస్జీటీలకు స్కూల్​అసిస్టెంట్​ప్రమోషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల తర్వాత  మిగిలిన వారి ట్రాన్స్​ఫర్లను డీఈవో దుర్గాప్రసాద్​ సోమవారం పూర్తి చేశారు. ఈ క్రమంలో మొత్తం 1,321ఎస్టీజీలు బదిలీ అయ్యారు. జీవో 25 ప్రకారం 19 మంది స్టూడెంట్స్​కు ఒక టీచర్ లెక్కన వెకెన్సీలు చూపి ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్​ జారీ చేశారు. బదిలీ అయ్యే టీచర్​ స్థానంలో మరొకరురాని సందర్భంలో వారిని ఎట్టి పరిస్థితిలో రిలీవ్​ చేయొద్దని ఎంఈవోలను ఆదేశించారు.

రిటర్మెంట్​కు మూడేళ్ల సర్వీసు మాత్రమే ఉన్న ఎస్టీజీలకు ట్రాన్స్​ఫర్​ నుంచి మినహాయింపునిచ్చారు.  ఒక బడిలో జూన్​1కి కనీసం రెండేండ్లు పనిచేసిన  టీచర్లకు బదిలీకి ఎలిజిబిలిటీ ఫిక్స్​ చేసి, ఎనిమిదేండ్లు దాటిన ఎస్జీటీలకు తప్పనిసరి ట్రాన్స్​ఫర్​ అమలు చేశారు. సీనియారిటీ లిస్టును ఆన్​లైన్​లో ప్రదర్శించి బదిలీ చేసిన టీచర్లకు వెబ్​ ఆప్షన్​లో  వారు కోరిన స్కూల్స్​ ఎలాట్​ చేశారు. దీంతో తొమ్మిదేండ్ల నుంచి నానుతూ వచ్చిన ఎస్జీటీల ప్రమోషన్లు పూర్తికాగా ట్రాన్స్​ఫర్​లూ ముగిశాయి.  

​846 మందికి ప్రమోషన్​ బెనిఫిట్​ 

జిల్లాలో లోకల్​ బాడీస్​, గవర్నమెంట్​ కలిపి 693 ప్రైమరీ, 116 అప్పర్​ ప్రైమరీ, 230 హైస్కూల్స్​ ఉన్నాయి. గత సెప్టెంబర్ ​ నెలలో  గెజిటెడ్​ హెచ్​ఎంలు, స్కూల్​ అసిస్టెంట్​ల ట్రాన్స్​ఫర్​లు జరిగాయి. ఫలితంగా ఏర్పడిన ఖాళీలను అర్హతగల ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చి నింపాలని ఆఫీసర్లు నిర్ణయించారు. అయితే ఎల్​ఎఫ్​ఎల్​ హెచ్​ఎంలకు పదోన్నతుల విషయంలో వివాదం తలెత్తగా తరువాతి ప్రక్రియ మొత్తం ఆగిపోయింది.

దీనిని సక్సెస్​ఫుల్​గా హ్యాండిల్​ చేయాలని విద్యాశాఖ ఆఫీసర్లను గవర్నమెంట్ ఆదేశించడంతో కదలిక వచ్చింది. ఎల్​ఎఫ్​ఎల్​ హెచ్​ఎంలతో పాటు తొమ్మిదేండ్లుగా ప్రమోషన్​ కోసం ఎదురుచూసిన భాషా పండిత్​, పీఈటీలకు మేలు చేసేలా నిర్ణయాలు వెలువడ్డాయి. ఎస్జీటీలు, పీఈటీ, భాషా పండిత్​లు మొత్తం 846 మంది ప్రమోషన్​లు పొంది కొత్త బడులలో జూన్​ 20న జాయిన్​ అయ్యారు. దీంతో జిల్లాలో అప్పటికే వెకెంట్​గా ఉన్న 394 టీచర్​ పోస్టులకు తోడు ప్రమోషన్లతో ఏర్పడిన ఖాళీలు కలిపి ప్రైమరీ స్కూళ్లలో మొత్తం 1,321 ఖాళీలు ఏర్పడ్డాయి. వాటిని సోమవారం ట్రాన్స్​ఫర్లతో సర్దుబాటు చేశారు.   

భారీ ​కసరత్తు 

టీచర్ల ప్రమోషన్​ల టైంలో కొన్ని ఆరోపణలు రావడంతో ఎస్జీటీల బదిలీ విషయంలో ఆఫీసర్లు జాగ్రత్తలు పాటించారు. జూన్​ 1 కటాఫ్​తో ఒక స్కూల్​లో కనీసం రెండేండ్ల సర్వీస్​ పూర్తి చేసుకొని ట్రాన్స్​ఫర్ కావాలనుకుంటున్న టీచర్లు దరఖాస్తు చేసుకోడానికి విడిగా సమయం ఇచ్చారు. డీఈవో దుర్గాప్రసాద్​ సీనియారిటీ లిస్టును ప్రిపేర్​ చేసి ​ డీఎస్​ఈకి (స్కూల్​ డైరెక్టరేట్​)కు పంపారు. లిస్టుపై అభ్యంతరాలు తెలపడానికి టీచర్లకు డీఎస్​ఈ రెండు రోజుల సమయం ఇచ్చి ఆమోదం తెలిపాకే ఫైనల్​ ట్రాన్స్​ఫర్​ ఆర్డర్స్​ సోమవారం విడుదల చేశారు.

 19 మంది స్టూడెంట్స్​కు ఒక టీచర్​ ప్రామాణికంగా నిర్ణయాలు తీసుకునప్పటికీ బదిలీ అయిన టీచర్​ స్థానంలో కొత్తగా మరొకరు రాని పక్షంలో రిలీవ్​ చేయకుండా ఎంఈవో, హెడ్​మాస్టర్​లకు అధికారాలు ఇచ్చారు. అలా ఎంత మంది ఉన్నారనే సంగతి మంగళవారం తేలనుంది. సోమవారం నాటి ట్రాన్స్​ఫర్స్​పై కూడా అభ్యంతరాలు తెలపడానికి రెండు రోజుల ఛాన్స్​ ఇచ్చారు. 

వీవీలతో తాత్కాలిక చెక్​

ఎస్జీటీల ప్రమోషన్​, ట్రాన్స్​ఫర్స్​ తరువాత ఇంకా ఖాళీలున్నాయి. హైస్కూల్స్​, అప్పర్​ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల్లో ఖాళీలు కొత్త భర్తీలతోనే నిండుతాయి.  డీఎస్సీ నిర్వహణకు గవర్నమెంట్​ ఒకపక్క సన్నాహాలు చేస్తోంది. అయితే కొత్త టీచర్ల  అపాయింట్​మెంట్​ పూర్తయ్యేదాకా విద్యావాలంటీర్లతో భోదనపరమైన ఇబ్బందులు అధిగమించే  ఆలోచనతో ఉంది.