
నిజామాబాద్, వెలుగు : మనుషుల నిత్యజీవితంలో సైన్స్ ఓ భాగమని డీఈవో పార్శి అశోక్ అన్నారు. శుక్రవారం స్నేహ సొసైటీ ఆధ్వర్యంలోని దివ్యాంగుల స్కూల్ విద్యార్థులు నిర్వహించిన నేషనల్ సైన్స్ దినోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విద్యార్థులు చెడు అలవాట్లకు దూరంగా ఉండి, క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలన్నారు.
కార్యక్రమంలో రాష్ట్రపతి అవార్డు గ్రహీత నర్రా రామారావు, రాష్ట్ర ఉత్తమ టీచర్ అవార్డు గ్రహీత విజయానందరావు, జిల్లా సైన్స్ అధికారి గంగాకిషన్, అర్బన్ సీడీపీవో సౌందర్య, స్నేహ సొసైటీ సెక్రటరీ ఎన్.సిద్ధయ్య, స్పెషల్ స్కూల్ ప్రిన్సిపాల్ జ్యోతి, మానసిక వికలాంగుల స్పెషల్ స్కూల్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి ఉన్నారు.
ప్రతి విద్యార్థి శాస్త్రవేత్త కావాలి
బోధన్, వెలుగు : ప్రతి విద్యార్థి ఒక శాస్త్రవేత్త కావాలని జిల్లా సైన్స్ ఆఫీసర్ గంగాకిషన్ సూచించారు. శుక్రవారం బోధన్లోని విజయసాయి స్కూల్లో నేషనల్ సైన్స్ డే నిర్వహించారు. ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, అకడమిక్ ఇన్చార్జి సువర్చల, చక్రవర్తి పాల్గొన్నారు.
బీర్కూర్లో..
బీర్కూర్, వెలుగు : బీర్కూర్లోని మహాత్మాజ్యోతిబాపూలే బాలుర కళాశాలలో శుక్రవారం జాతీయ సైన్స్ డే నిర్వహించారు. స్టూడెంట్లు తయారు చేసిన ప్రయోగ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్ శివ కుమార్ విద్యార్థులను అభినందించారు.