
కొత్తగూడ, వెలుగు : పాఠశాలలు రీ ఓపెన్ అయ్యేసరికి విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్స్ అందించాలని డీఈఓ పి. రామారావు అన్నారు. మంగళవారం మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో పాఠ్య పుస్తకాల పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా సిబ్బంది చర్యలు తీసుకోవాలన్నారు. పాఠ్య పుస్తకాల పంపిణీ వివరాలను రికార్డు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో శ్రీదేవి, ప్రత్యేక అధికారి శ్రీనాథ్ ఉన్నారు.