
- బోర్డు ఎగ్జామ్స్ కోసం టెన్త్ స్టూడెంట్లను ప్రిపేర్ చేసేందుకు పరీక్షలు
హైదరాబాద్, వెలుగు: కరోనా కారణంగా స్టూడెంట్లలో చదువుపై కాన్సంట్రేషన్ తగ్గిపోయింది. రెండేండ్లకు పైగా ఫిజికల్ క్లాసులు, పరీక్షలకు దూరంగా ఉండిపోయారు. దీంతో స్టూడెంట్లలో మానసిక సమస్యలు రావడం, లెర్నింగ్పై ఆసక్తి తగ్గిపోయాయి. ప్రస్తుతం స్కూళ్లు నార్మల్గా కొనసాగుతుండగా, పదో తరగతి పిల్లలకు బోర్డు పరీక్ష సమయం సమీపిస్తుండగా వారిపై ఒత్తిడి తగ్గించేలా విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తోంది.
ముందుగా ప్రాక్టికల్స్
స్టూడెంట్లలో బోర్డ్ఎగ్జామ్స్పై భయాన్ని పోగొట్టేందుకు ముందుగా స్కూళ్లలో ప్రాక్టీస్ ఎగ్జామ్స్పెట్టి అవగాహన కల్పించాలని విద్యాశాఖ ఆదేశించింది. దీంతో మార్చిలో రెండు సార్లు ముందస్తు ప్రాక్టీస్ టెస్టులను నిర్వహించారు. ఈ క్రమంలో మే చివరి వారంలో బోర్డ్ఎగ్జామ్స్షెడ్యూల్ రిలీజైంది. ఎండల తీవ్రత స్టూడెంట్లపై ప్రభావాన్ని చూపుతుందని పేరెంట్స్, టీచర్లు ఆ సమయంలో పరీక్షలు వద్దని అంటున్నారు. ఈ నేపథ్యంలో పరీక్షల తేదీల్లో మార్పాలుంటాయా లేదా వేచి చూడాలి. ఏప్రిల్లో మరో ప్రాక్టీస్ టెస్ట్ పెట్టాల్సి ఉందని, ఆ తర్వాత ప్రీ ఫైనల్ఎగ్జామ్స్ ఉంటాయని టీచర్లు అంటున్నారు.
ఏ సబ్జెక్ట్లో వెనకబడి ఉన్నారనేది..
ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాస్తే ఫైనల్ ఎగ్జామ్లో క్వశ్చన్ పేపర్ గురించి స్టూడెంట్లకు అవగాహన వస్తుంది. ఇంపార్టెంట్ ప్రశ్నల మీద పట్టు కుదురుతుంది. దీంతో పాటు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎగ్జామ్ ఎలా పూర్తి చేయాలనేది స్టూడెంట్లకు తెలుస్తుందని టీచర్లు చెప్తున్నారు. ప్రాక్టీస్ టెస్టుల ద్వారా స్టూడెంట్లు ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారనేది తెలుస్తుంది. దీంతో వెనకబడిన స్టూడెంట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టొచ్చని టీచర్లు చెప్తున్నారు.
స్టూడెంట్స్లో ఇంట్రెస్ట్ పెంచేందుకు..
స్టూడెంట్లకు ముందుగా రివిజన్ చాలా అవసరం. కరోనా కారణంగా రెండేండ్ల నుంచి చదువు సక్కగ సాగలేదు. ప్రాక్టీస్ ఎగ్జామ్తో వారిలో కొంత ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఎగ్జామ్ రాసే విధానం, ఇన్టైమ్లో ఎలా పూర్తి చేయాలనే అంశాలు తెలుస్తాయి.
- శారద, హెచ్ఎం, గవర్నమెంట్ హైస్కూల్, మాసబ్ ట్యాంక్
ఎగ్జామ్స్పై కాన్సంట్రేషన్ చేసేందుకు..
కొన్ని రోజుల కిందటి వరకు టెన్త్ స్టూడెంట్లు బోర్డ్ ఎగ్జామ్స్ రాసేందుకు సిద్ధంగా లేకుండే. వారు ఎగ్జామ్స్పై కాన్సంట్రేషన్ చేసేందుకు ఈ టెస్ట్ లను నిర్వహించారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కూర్చొని ఎగ్జామ్ రాయడం కూడా ఇప్పుడే ప్రాక్టీస్ అవుతోంది.
- పద్మ, టీచర్, ఉప్పల్ గవర్నమెంట్ స్కూల్