
ఆంధ్రప్రదేశ్ లో 2020-21 అకాడమిక్ ఇయర్ కు సంబంధించి ప్రాథమిక పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ ను సిద్ధం చేశారు విద్యాశాఖ అధికారులు. ఆ రాష్ట్ర సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా సెప్టెంబరు 5న పాఠశాలలు తెరుచుకోనున్నాయి.అందుక అనుగుణంగా ఈ క్యాలెండర్ రూపొందించారు. కరోనా పరిస్థితిని అంచనా వేసి మరో వారం, పది రోజుల్లో అకడమిక్ క్యాలెండర్ను పాఠశాల విద్యాశాఖ అధికారికంగా ప్రకటిస్తుంది. సన్నాహక క్యాలెండర్ ప్రకారం … వచ్చే నెల 5 నుంచి పాఠశాలలు పునఃప్రారంభిస్తారు. సెప్టెంబరులో 21 రోజులు, అక్టోబరులో 21 రోజులు, నవంబరులో 24 రోజులు, డిసెంబరులో 25/22 రోజులు, జనవరిలో 20/23 రోజులు, ఫిబ్రవరిలో 23 రోజులు, మార్చిలో 25 రోజులు, ఏప్రిల్లో 21 రోజులు పాఠశాలలు పనిచేయనున్నాయి. మొత్తంగా 2022-21లో 181 పనిదినాలు ఉంటాయి.
పరీక్షల ప్రణాళిక:
నిర్మాణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు అక్టోబర్ లో, సంగ్రహణాత్మక మూల్యాంకనం-1 పరీక్షలు జనవరిలో, నిర్మాణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు మార్చిలో, సంగ్రహణాత్మక మూల్యాంకనం-2 పరీక్షలు ఏప్రిల్లో జరుగుతాయి.
కాలనిర్ణయ పట్టిక: 1 నుంచి 5 తరగతులకు మొదటి పీరియడ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటల వరకు మొత్తం 8 పీరియడ్లు ఉంటాయి. అయితే ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్-3, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్-4, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్లాస్-5లలో మూడేసి పాఠాలను తొలగించారు.
సెలవుల ప్రణాళిక:
దసరా: 2.10.2020-26.10.2020
క్రిస్మస్: 24.12.2020-28.12.2020
సంక్రాంతి :12.01.2021- 17.01.2021
వేసవి సెలవులు: 24.04.2021-11.06.2021 వరకు ఉండనున్నాయి.