నేడు ( 8న ) అన్ని పార్టీల ఎంపీలతో భేటీ: కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలే ఎజెండా

నేడు ( 8న ) అన్ని పార్టీల ఎంపీలతో భేటీ: కేంద్రం నుంచి రావాల్సిన నిధులు, పెండింగ్ సమస్యలే ఎజెండా
  • డిప్యూటీ సీఎం భట్టి అధ్యక్షతన ప్రజాభవన్​లో ఉదయం భేటీ

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం వద్ద రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్న నిధులు, సమస్యల పరిష్కారానికి రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎంపీలతో సమావేశం నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధ్యక్షతన శనివారం ఉదయం 11 గంటలకు ప్రజాభవన్ లో అన్ని పార్టీల ఎంపీల మీటింగ్ జరగనుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం వద్ద అపరిష్కృతంగా ఉన్న రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. 

పెండింగ్‌‌లో ఉన్న సమస్యలపై ఎంపీలు పార్లమెంట్‌‌లో, కేంద్ర ప్రభుత్వం వద్ద మాట్లాడాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయత్నం చేస్తున్నట్లు శుక్రవారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌‌లతో పాటు రాష్ట్ర ఎంపీలందరిని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి స్వయంగా ఫోన్ చేసి సమావేశానికి ఆహ్వానించారు.