కాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్ దంపతులు..

కాంగ్రెస్ లో చేరిన డిప్యూటీ మేయర్ దంపతులు..

జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్  దంపతులు మోతె శ్రీలత, శోభన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. ఫిబ్రవరి 25వ తేదీ ఆదివారం గాంధీ భవన్ లో దీపా దాస్ మున్షీ, మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి దీపా దాస్ హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. డిప్యూటీ మేయర్ తోపాటు పలువురు బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ లో చేరారు.

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ లు ఉద్యమకారులను విస్మరించారని డిప్యూటీ మేయర్ శ్రీలత దంపతులు అన్నారు. పార్టీ కోసం 24 ఏండ్లు పనిచేసినా, ఉద్యమకారులకు విలువలేకుండా పోయిందని.. తమకు సరైన గుర్తింపు లభించలేదని.. అందుకునే బీఆర్ఎస్ కు రాజీనమా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు చెప్పారు.  కాగా,ఫిబ్రవరి 24వ తేదీ శనివారం  బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి డిప్యూటీ మేయర్ దంపతులు మోతె శ్రీలత, శోభన్ రెడ్డిలు రాజీనామా చేశారు.