సరిహద్దును పంచుకుంటున్న ఏడు దేశాల అవరోహణ క్రమం

సరిహద్దును పంచుకుంటున్న ఏడు దేశాల అవరోహణ క్రమం

అధిక విస్తీర్ణం, ఖండానికి ఉండాల్సిన భౌతిక, సాంఘిక, సాంస్కృతిక వైవిధ్యతలను కలిగి ఉండటంతో భారత్​ను ఉపఖండం అని పిలుస్తారు. ఈ ఉపఖండంలోకి భారత్​, పాకిస్తాన్​, నేపాల్​, భూటాన్​, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవులు వస్తాయి. సరిహద్దున ఉన్న ఏడు దేశాలతో 15,106.7 కి.మీ.ల పొడవైన భూ సరిహద్దును భారత్​ కలిగి ఉంది. ఈ సరిహద్దును 16 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు పంచుకుంటున్నాయి. సరిహద్దును పంచుకుంటున్న ఏడు దేశాల అవరోహణ క్రమం కింది విధంగా ఉంది. 

భారత్​ VS చైనా 

భారత్​, చైనాల మధ్య ముఖ్యంగా మూడు వివాద ప్రాంతాలు ఉన్నాయి. 

1. పశ్చిమ సెక్టార్​: భారత్​లోని లఢఖ్​కు, చైనాలోని సికియాంగ్​ ప్రావిన్స్​కు మధ్య పశ్చిమ సెక్టార్​ ఉంది. ఇక్కడ భారత భూభాగం ఆక్సాయ్​చిన్​ను చైనా ఆక్రమించుకుంది. ఇక్కడి సరిహద్దు రేఖను లైన్​ ఆఫ్​ యాక్చువల్​ కంట్రోల్​(ఎల్​ఓఏసీ) అంటారు. 

2. మధ్య సెక్టార్​: చైనాకు చెందిన టిబెట్​ ప్రాంతానికి, భారత్​లోని ఉత్తరాఖండ్, హిమాచల్​ప్రదేశ్​ రాష్ట్రాల మధ్య మధ్య సెక్టార్​ ఉంది. 

3. తూర్పు సెక్టార్​: చైనాలోని టిబెట్​ ప్రావిన్స్​కు భారత్​లోని అరుణాచల్​ప్రదేశ్​కు మధ్య తూర్పు సెక్టార్​ ఉంది. ఇక్కడ భారత భూభాగం సమత్​జంగ్​ను చైనా ఆక్రమించుకుంది. ఈ ప్రదేశంలో భారత్, చైనాల మధ్య 1914లో మెక్​మోహన్​ రేఖను గీశారు. కానీ ఈ రేఖను చైనా అంగీకరించడం లేదు. 

భారత్​ VS పాకిస్తాన్​​

1948లో భారత్​, పాకిస్తాన్​ మధ్య జరిగిన యుద్ధంలో కశ్మీర్​ పాకిస్తాన్​ ఆక్రమిత కశ్మీర్​ లేదా ఆజాద్​ కశ్మీర్​, కశ్మీర్​గా విడిపోయింది. పీవోకే, కశ్మీర్​ మధ్య గల సరిహద్దునే సీజ్​ ఫైర్​ లైన్​ అని ఆ తర్వాత జరిగిన సిమ్లా ఒప్పందం ప్రకారం ఈ సరిహద్దును లైన్​ ఆఫ్​ కంట్రోల్​గా మార్చారు. 

ఎ. జమ్ముకశ్మీర్​, లఢఖ్​లో​ సరిహద్దు రేఖలు 

లఢఖ్​లో వివాదాస్పద ప్రాంతం సియాచిన్​. సవాయి నుంచి మాధవ్​పూర్​ వరకు అంతర్జాతీయ సరిహద్దు రేఖ అని, మాధవ్​పూర్​ నుంచి ఎన్​జే9842 వరకు లైన్​ ఆఫ్​ కంట్రోల్​ అని, ఎన్​జే 9842 నుంచి ఇందిరాకాల్​ వరకు ఆక్చువల్​ గ్రౌండ్​ పొజిషన్​ లైన్​ అని పిలుస్తున్నారు. 

బి. రాడ్​క్లిఫ్​ అవార్డ్​

రాడ్​క్లిఫ్​ అవార్డ్​ ప్రకారం సర్​ రాడ్​క్లిఫ్​ అనే వ్యక్తి 1947లో భారతదేశాన్ని మూడు భాగాలుగా విభజించారు. 1. భారత్​, 2. పశ్చిమ పాకిస్తాన్​, 3. తూర్పు పాకిస్తాన్​(ప్రస్తుతం బంగ్లాదేశ్​). ఈ రాడ్​క్లిఫ్​ రేఖ ప్రస్తుతం భారత్​, పాకిస్తాన్​ మధ్య ఉంది. 

సి. సర్ క్రిక్​ వివాదం

ఈ వివాదం భారత్​, పాకిస్తాన్ మధ్య ఉంది. ఇక్కడ పాకిస్తాన్​ గీసిన 24 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని భారత్​ గుర్తించడం లేదు. 

డి. రాణా ఆఫ్​ కచ్​ 

ఇది భారత్​, పాకిస్తాన్​ల ​ మధ్య ఉంది.

భారత్​​ VS  ఆప్గనిస్తాన్​ 

భారత్​, ఆప్గనిస్తాన్​ల మధ్య సరిహద్దు రేఖను డ్యూరాండ్​ రేఖ అంటారు.  ప్రస్తుతం ఇది భారత్​, పాకిస్తాన్​, భారత్​, ఆఫ్గనిస్తాన్​ల మధ్య ఉంది.

జల సరిహద్దులు 

భారత్​కు 6100 కి.మీ.ల ప్రధాన భూభాగ తీర రేఖ ఉంది. దీవులతో కలిపి తీరరేఖ పొడవు 7516 కి.మీ.  

1. భారత్​- శ్రీలంక 

భారత్​, శ్రీలంక మధ్య ఆడమ్స్​ బ్రిడ్జ్​, పాంబన్​ దీవి, పాక్​ జలసంధి, మన్నార్​ సింధుశాఖ ప్రాంతాలు ఉన్నాయి. తమిళనాడుకు దక్షిణాన పాంబన్​ దీవిలోని ధనుష్​కోటి నుంచి శ్రీలంకలోని తలైమన్నార్​ ప్రాంతం వరకు విస్తరించి ఉంది.  పాక్​ జలసంధి భారత్​లోని పాయిండట్​ కొడిక్కిరామ్​ నుంచి శ్రీలంకలోని పీడ్​మౌంట్​ వరకు ఉంది.  నాగర్​కోయల్​(తమిళనాడు) నుంచి శ్రీలంకలోని మన్నార్​ వరకు విస్తరించి ఉంది.   

2. భారత్​- మాల్దీవులు 

భారత్​కు మాల్దీవులకు మధ్య 8 డిగ్రీల ఛానల్​ ఉంది. 

3. భారత్​ – ఇండోనేషియా

గ్రేట్​ నికోబార్ దీవికి, ఇండోనేషియాలోని సుమత్రా దీవికి మధ్య గ్రేట్​ ఛానల్​ ఉంది.

4. భారత్​–థాయ్​లాండ్​

భారతదేశానికి థాయ్​లాండ్​కు మధ్య అండమాన్​ సముద్రం ఉంది.

5. భారత్​ – మయన్మార్​

భారత్​కు, మయన్మార్​కు మధ్య కోకోఛానల్​ ఉంది.

6. భారత్​– బంగ్లాదేశ్​

భారత్​కు బంగ్లాదేశ్​కు మధ్య గల న్యూమూర్​ దీవి ఉంది.