దేశ్ పాండే ఫౌండేషన్  ఆధ్వర్యంలో..స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్

దేశ్ పాండే ఫౌండేషన్  ఆధ్వర్యంలో..స్కిల్ డెవలప్​మెంట్ సెంటర్

మహబూబ్ నగర్, వెలుగు: మహబూబ్​నగర్ లోని కేజీబీవీ, డిగ్రీ కాలేజీలో స్కిల్  ఫౌండేషన్  సెంటర్  ఏర్పాటుకు దేశ్ పాండే ఫౌండేషన్  సిద్ధంగా ఉందని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్​రెడ్డి తెలిపారు. సీఎం సూచన మేరకు సంస్థ ఆధ్వర్యంలో కర్నాటక రాష్ట్రం హుబ్లీలో జరుగుతున్న కాన్ఫరెన్స్ కు ఎమ్మెల్యే హాజరయ్యారు.

సంస్థ చైర్మన్  గురురాజును కలిసి పాలమూరులో విద్యా వ్యవస్థ, ఉచితంగా అందిస్తున్న డిజిటల్  కంటెంట్  స్టడీ మెటీరియల్, మహబూబ్​నగర్  విద్యానిధి నవరత్నాలు తదితర కార్యక్రమాల గురించి వివరించారు. ఎమ్మెల్యే చేస్తున్న కృషిని చైర్మన్  అభినందించారు. మహబూబ్​నగర్​లో స్కిల్  డెవలప్​మెంట్  సెంటర్ ఏర్పాటుకు అంగీకరించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.