అక్టోబర్ 4 నుంచి 6 వరకు డిజైన్ డెమోక్రసీ

అక్టోబర్ 4 నుంచి 6 వరకు డిజైన్ డెమోక్రసీ

హైదరాబాద్, వెలుగు: డిజైన్ ఫెస్టివల్ ‘డిజైన్ డెమోక్రసీ’ అక్టోబర్ 4 నుంచి 6 వరకు హైదరాబాద్​లోని హైటెక్స్​లో జరగనుంది. డిజైన్​క్రియేటర్లు, నిపుణులు,  ఔత్సాహికులు ఇందులో పాల్గొంటారు. తెలంగాణ నుంచి ఆరుగురు డిజైనర్లు వస్తున్నారని డిజైన్ డెమోక్రసీ ఫౌండర్​ పల్లికా శ్రీవాస్తవ్ అన్నారు. ఇది బీ2బీ, బీ2సీ ఎగ్జిబిషన్​ అని, కార్యక్రమం సందర్భంగా భారీ బిజినెస్​జరిగే అవకాశం ఉందని చెప్పారు. 

దేశవిదేశాల నుంచి వచ్చే డిజైనర్లు, కంపెనీలు 85 స్టాల్స్​ను ఏర్పాటు చేస్తారని ప్రకటించారు.   లైటింగ్, ఫర్నిచర్, ఆర్కిటెక్చరల్, యాక్సెసరీస్​​సహా పలు ప్రొడక్టులను ప్రదర్శిస్తామని చెప్పారు.