యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ

యాదగిరిగుట్టలో భక్తుల రద్దీ
  • ధర్మదర్శనానికి రెండు, ప్రత్యేక దర్శనానికి అరగంట టైం
  • ఆదివారం ఒక్కరోజే రూ.47.65 లక్షల ఆదాయం

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరిసింహస్వామి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిక్కిరిసిపోయాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి రెండు గంటలు, స్పెషల్ దర్శనానికి అరగంట టైం పట్టిందని భక్తులు తెలిపారు. స్వామివారి నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.

భక్తులు జరిపించిన వివిధ రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.47,65,035 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.17,35,050, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.5,63,500, వీఐపీ దర్శనాలతో రూ.8.10 లక్షలు, బ్రేక్‌‌‌‌ దర్శనాల ద్వారా రూ.4,29,900 ఇన్‌‌‌‌కం వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు.