
అలంపూర్, వెలుగు: జోగులాంబ, బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బాల బ్రహ్మేశ్వరస్వామి ఆలయంలో అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జోగులాంబ అమ్మవారిని దర్శించుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్ లో వేచి ఉన్నారు. అమ్మవారికి కుంకుమార్చన, ప్రత్యేక పూజలు చేశారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది.