అడవుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి : డీఎఫ్​వో కిష్టాగౌడ్​

అడవుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలి : డీఎఫ్​వో కిష్టాగౌడ్​

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : అడవుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని డీఎఫ్​వో జి. కిష్టాగౌడ్​అన్నారు. జాతీయ అటవీ అమరవీరుల దినోత్సవం సందర్భంగా లక్ష్మీదేవిపల్లి మండలంలోని సెంట్రల్​పార్క్​లో బుధవారం ఏర్పాటు చేసిన ప్రోగ్రాంలో అడవుల రక్షణలో భాగంగా ప్రాణాలను త్యాగం చేసిన అమరవీరులను స్మరించారు.

ఆదివాసీల చేతిలో హత్యకు గురైన ఫారెస్ట్​ ఆఫీసర్​ చలమల శ్రీనివాసరావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలను నాటి, వాటిని సంరక్షించడం ప్రధానమన్నారు. అడవుల పరిరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని తెలిపారు. ఈ ప్రోగ్రాంలో ఏసీఎఫ్​ యు. కోటేశ్వరరావు, అధికారులు దామోదర్​రెడ్డి, బి. బాబు, సిబ్బంది పాల్గొన్నారు.  

దమ్మపేట : దమ్మపేట మండల కేంద్రంలోని దమ్మపేట రేంజ్ కార్యాలయంలో అటవీ రేంజ్ అధికారి కరుణాకరాచారి ఆధ్వర్యంలో అమరులైన అడవి శాఖ అధికారులకు ఘనంగా నివాళులర్పించారు. దమ్మపేట మండల కేంద్రం నుంచి మందలపల్లి జాతీయ రహదారి వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, మానవహారం చేపట్టారు.