కుటుంబసభ్యులతోపాటు ఓటు వేసిన DGP, అడిషనల్ DGP

కుటుంబసభ్యులతోపాటు ఓటు వేసిన DGP, అడిషనల్ DGP

తెలంగాణలో ఎన్నికలు పండుగ వాతావరణంలో జరుగుతున్నాయి. సోమవారం ఉదయం 7గంటలకే పోలింగ్ కేంద్రాలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు, సినీ సెలబ్రెటీలు ఎక్కువగా పోలింగ్ ప్రారంభంలోనే వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ డీజీపీ రవి గుప్త, ఆయన కుటుంబసభ్యులతో కలిసి జూబిలీహిల్స్ ఏరియాలోని సెంట్రల్ నర్సరీ పోలింగ్ బూత్ లో ఓటు వేశారు.

అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ కూడా ఆయన కూతురు, భార్యతోపాటు కున్‌దన్‌బాగ్ కాలనీలోని చిన్మయ స్కూల్‌లో వారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అలాగే తార్నాక వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ హాల్లో ప్రొఫెసర్ కోదండరాం దంపతులు వారి ఓటు హక్కును  వినియోగించుకున్నారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరు స్వచ్ఛదంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.