క్రికెటర్‌ను భార్య ఎదుటే కాల్చి చంపిన దుండగులు

క్రికెటర్‌ను భార్య ఎదుటే కాల్చి చంపిన దుండగులు

శ్రీలంక క్రికెట్ లో దారుణం చోటు చేసుకుంది. మాజీ అండర్ 19 కెప్టెన్ ధామిక నిరోషన్ ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. అతని కుటుంబం చూస్తుండగానే దుండగులు ఈ లంక క్రికెటర్ ను కాల్చి చంపడం షాకింగ్ కు చేస్తుంది. గాలె జిల్లాలోని అంబాలన్‌గోడా ప్రాంతంలో మంగళవారం(జూలై 16) నాడు ఈ ఘటన చోటు చేసుకుంది. కాల్చిన వారు వెంటనే అక్కడ నుంచి పారిపోయారు. అప్పటికే కాల్పులకు గురైన నిరోషన్ అక్కడికక్కడే చనిపోయారు. 

ధామిక నిరోషన్ ఎవరు చంపారో తెలియాల్సి ఉంది. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోస్లుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ మాజీ క్రికెటర్ మృతిపై లంక క్రికెటర్లు దిగ్బ్రాంతి వ్యక్తంచేశారు. ధామిక నిరోషన్ హఠాత్తుగా మరణించడంతో  చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కేసును ఛేదించడానికి సహాయం చేయడానికి ఎవరైనా ముందుకు రావాలని అధికారులు రిక్వెస్ట్ చేశారు. ధామిక 2000 ఏడాది శ్రీలంక అండర్ 19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత రెండేళ్లపాటు వన్డేలు, టెస్టులకు ఆడాడు.