‘వేట్టయాన్’ సినిమాతో ఇటీవల ప్రేక్షకులను పలకరించిన రజినీకాంత్.. మరోవైపు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కూలీ’ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు ఆయన హీరోగా ‘జైలర్ 2’ సెట్స్కు వెళ్లేందుకు రెడీ అవుతోంది. ‘జైలర్’ సినిమాకు మోహన్ లాల్, శివరాజ్ కుమార్ లాంటి స్టార్స్ను యాడ్ చేసి, మేజిక్ క్రియేట్ చేసిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్.. ఈసారి సీక్వెల్ కోసం మరో స్టార్ను రంగంలోకి దింపుతున్నాడట.
అతను ఎవరో కాదు.. కోలీవుడ్ స్టార్ ధనుష్. రజినీకాంత్కు ధనుష్ వీరాభిమాని అనే విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ విషయంపై రజినీకాంత్ నుంచి అనుమతి కూడా పొందినట్టు తెలుస్తోంది. రియల్ లైఫ్లో మామాఅల్లుళ్లైన వీళ్లిద్దరి కాంబినేషన్లో సినిమా చూడాలని అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. అయితే రజినీ కూతురు ఐశ్వర్యతో ధనుష్ విడాకుల తర్వాత ఆ ఆశలు కాస్త సన్నగిల్లాయి. అయితే దర్శకుడు నెల్సన్ కారణంగా ‘జైలర్ 2’ రూపంలో ఈ కాంబో సెట్ అవబోతోంది. ప్రస్తుతానికి ప్రచారంలో ఉన్న ఈ కాంబినేషన్పై త్వరలోనే అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందేమో చూడాలి!