భూభారతి రూల్స్‎కు ధరణి పోర్టల్ బ్రేక్.. యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు..!

భూభారతి రూల్స్‎కు ధరణి పోర్టల్ బ్రేక్.. యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు..!
  • భూభారతి రూల్స్‎కు ధరణి పోర్టల్ బ్రేక్..!
  • నెల గడుస్తున్నా చట్టానికి రూల్స్ మొదలుపెట్టని అధికారులు
  • 40–-45 రోజుల్లో తెస్తామని గతంలో వెల్లడి
  • రూల్స్‎కు ధరణి పోర్టల్
  • సాఫ్ట్​వేర్​కు లింక్ పెట్టి ఆలస్యం
  • యూజర్ ఫ్రెండ్లీ లేక రైతులకు తిప్పలు

హైదరాబాద్, వెలుగు: భూ భారతి చట్టానికి రూల్స్ మరింత ఆలస్యం అవుతున్నాయి. నెలన్నర గడుస్తున్నా ఇంతవరకు ఆ దిశగా అధికారులు కసరత్తు చేయడం లేదని తెలుస్తున్నది. భూ భారతి చట్టం అసెంబ్లీలో ఆమోదం సందర్భంగా 45 రోజుల్లోగా రూల్స్​తీసుకొస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పకడ్బందీగా ఉంటాయని తెలిపింది. పోర్టల్‎లో కూడా 35 మాడ్యుల్స్‏ను ఆరుకు కుదిస్తామని.. ఎలాంటి గందరగోళం లేకుండా రైతులకు యూజర్​ఫ్రెండ్లీగా కొత్త పోర్టల్‎ను అందుబాటులోకి తెస్తామని పేర్కొన్నారు. అయితే ఇప్పుడు అదే ధరణి పోర్టల్ భూ భారతి రూల్స్‎ను ఆలస్యం చేస్తున్నట్లు తెలుస్తున్నది. 

ఇప్పటికిప్పుడు కొత్త పోర్టల్‎ను రెడీ చేసే అవకాశం లేకపోవడంతో ఉన్న ధరణి పోర్టల్‎లోనే మార్పులు చేయాలని నిర్ణయించారు. దీంతో సాప్ట్​వేర్‎లో మార్పులు చేయడం ఇబ్బంది అవుతుందంటూ భూ భారతి రూల్స్‎ను కూడా లేట్ చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. రూల్స్‎ను తీసుకొస్తే వెంటనే అమల్లోకి తీసుకురావాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ధరణి పోర్టల్​కు భూ భారతి రూల్స్​కు సంబంధం ఉన్నందున రూల్స్ ఫ్రేమ్ చేశాక.. పోర్టల్​లో మార్పులు చేయకపోతే ఉపయోగం ఉండదనే పేర్కొంటున్నారు. 

అయితే పోర్టల్​కు సంబంధం లేకుండా కూడా కొన్ని మార్గదర్శకాలు అమలు చేయొచ్చని సమాచారం. అయితే అటు ధరణి సాఫ్ట్ వేర్​లో మార్పులు చేస్తూ ఇటు భూభారతి చట్టానికి రూల్స్ తీసుకురావడంలో వేగంగా ముందుకు వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి. ధరణి పోర్టల్ యూజర్ ఫ్రెండ్లీగా వస్తే చాలా మంది రైతులకు తిప్పలు తప్పుతాయని అంటున్నారు. పైగా గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థను తిరిగి తీసుకువచ్చే కసరత్తును ప్రభుత్వం ప్రారంభించి వదిలేసింది. రూల్స్​లో గ్రామ అధికారులకు కూడా రికార్డుల నిర్వహణ వంటి బాధ్యతలు అప్పగించాల్సి ఉన్నది.

ధరణిని సెట్​ చేసేందుకు తిప్పలు

రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‎ను ప్రైవేట్​ఏజెన్సీ నుంచి పూర్తిగా ఎన్ఐసీ అధీనంలోకి గత డిసెంబర్ నెలఖారులో తీసుకువచ్చింది. అప్పటి నుంచి సర్వర్ ప్రాబ్లమ్స్‎తో ఎన్ఐసీ సతమతవుతున్నది. అప్పటి నుంచి ఏదైనా సమస్యలు వస్తే పరిష్కరించడానికి.. ప్రైవేట్ కంపెనీ ఎన్ఐసీకి పూర్తిగా సహకరించడం లేదు. ఇప్పటికిప్పుడు కొత్త పోర్టల్ సొంతంగా తయారు చేద్దామంటే అదీ కుదరని పరిస్థితి నెలకొన్నది. ధరణి మాదిరి కొత్త పోర్టల్ తయారు చేయాలంటే కనీసం 7 నెలల టైం పడుతుందని అంటున్నారు. 

Also Read :- కొత్త రేషన్ ​కార్డులకు మీసేవలోనూ దరఖాస్తులు

ఈ నేపథ్యంలో ధరణి పోర్టల్‎లో భూ భారతి చట్టంలో పేర్కొన్న విధంగా మార్గదర్శకాలు తీసుకువచ్చి మార్పులు చేయాల్సి ఉన్నది. ఇప్పుడున్న చిన్న, చిన్న సమస్యలను పరిష్కరించడమే కష్టంగా ఉన్న టైంలో భూ భారతి రూల్స్ తెచ్చి.. ధరణి సాప్ట్​వేర్‏లో అందుకు అనుగుణంగా మార్పులు చేయడం ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఆన్​లైన్​లో పహాణీ రికార్డుల నిర్వహణ వంటివన్నీ కొత్త చట్టం ప్రకారం చేయాల్సి ఉంది. అయితే ఇందుకు రూల్స్​ ప్రధానం కానున్నాయి.  13బీ, 38ఈ, ఓఆర్‌‌‌‌సీ, లావణి ప‌‌‌‌ట్టా వంటి మార్గాల‌‌‌‌లో భూమి వ‌‌‌‌చ్చిన‌‌‌‌ప్పుడు పాస్‌‌‌‌ పుస్తకాలు  ఆర్డీఓ ద్వారా ఇచ్చే అవ‌‌‌‌కాశాన్ని కొత్త చ‌‌‌‌ట్టం క‌‌‌‌ల్పిస్తోంది. 

దీనికి రూల్స్​ కావాలి. సాదాబైనామాల క్రమ‌‌‌‌బ‌‌‌‌ద్ధీక‌‌‌‌ర‌‌‌‌ణ‌‌‌‌కు ద‌‌‌‌ర‌‌‌‌ఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్న సుమారు 9 ల‌‌‌‌క్షల పైగా ఉన్న స‌‌‌‌న్న, చిన్న కారు రైతుల‌‌‌‌కు సంబంధించి కూడా రూల్స్​లోనే స్పష్టత దొరకనుంది. గ్రామ కంఠం, ఆబాదీల‌‌‌‌కు కూడా హ‌‌‌‌క్కుల రికార్డు, ట్రిబ్యునళ్లు, అప్పీళ్ల వ్యవస్థ, ఏ రైతైనా ఆర్థిక ఇబ్బందులు, ఇత‌‌‌‌ర కార‌‌‌‌ణాల‌‌‌‌తో అప్పీల్ చేసుకోలేని ప‌‌‌‌రిస్థితి ఉంటే, అలాంటి వారికి ప్రభుత్వమే ఉచితంగా న్యాయ సాయం అందించడం వంటివి భూ భారతి చట్టం రూల్స్ లో ముఖ్యమైనవి ఉన్నాయి.