వర్షాలు కురవాలని బైక్​ ర్యాలీ

వర్షాలు కురవాలని బైక్​ ర్యాలీ

పిట్లం, వెలుగు:  వర్షాలు కురవాలని కోరుతూ ధర్మారం గ్రామస్థులు బైక్​లపై యాత్ర చేసి  హనుమాన్​ ఆలయాల్లో పూజలు చేశారు. శనివారం పిట్లం మండలంలోని 11 గ్రామాల్లో  బైక్​ ర్యాలీ నిర్వహించి హనుమాన్​ఆలయాల్లో పూజలు, అభిషేకాలు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..  ఖరీఫ్​ వచ్చి నెల దాటినా ఇంత వరకు పెద్ద వర్షం కురవలేదన్నారు. వర్షాభావంతో నారుమళ్లు ఎండిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ 11 గ్రామాల్లో పర్యటించి పూజలు చేసినట్లు వారు తెలిపారు.