ఖాళీ బిందెలతో కలెక్టరేట్​ ముట్టడి

ఖాళీ బిందెలతో కలెక్టరేట్​ ముట్టడి

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు : ఆదిలాబాద్​పట్టణంలోని కస్తాల రామకిష్టు కాలనీకి నీరందించాలని డిమాండ్​ చేస్తూ బుధవారం కాలనీ వాసులు ఖాళీ బిందెలతో కలెక్టరేట్ ​ముందు ధర్నా చేశారు. కాలనీలో నెలకొన్న నీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్​చేశారు.

కొన్ని రోజులుగా మిషన్​భగీరథ నీటి సరఫరా లేక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం కారణంగానే సమస్య తలెత్తిందని ఆరోపించారు. ఇప్పటికైనా కలెక్టర్​ స్పందించి సమస్యను పరిష్కరించాలని  కోరారు.