పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధవన్‌

పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా ధవన్‌

న్యూఢిల్లీ: టీమిండియా సీనియర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌.. పంజాబ్‌ కింగ్స్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. ఈ మేరకు బుధవారం సమావేశమైన ఫ్రాంచైజీ.. మయాంక్‌ అగర్వాల్‌ను తొలగించి ధవన్‌కు బాధ్యతలు అప్పగించింది. వచ్చే ఐపీఎల్‌లో ధవన్‌.. పంజాబ్‌ టీమ్‌ను నడిపించనున్నాడు. గతేడాది కేఎల్‌ రాహుల్‌ లక్నోకు వెళ్లిపోవడంతో మయాంక్‌ను కెప్టెన్సీ ఇచ్చారు.  కానీ అతని సారథ్యంలో టీమ్​ నిరాశ పరిచింది. బ్యాటర్​గానూ మయాంక్‌ ఫెయిలయ్యాడు. గత మెగా వేలంలో ధవన్‌ను పంజాబ్‌ రూ. 8.25 కోట్లకు కొనుగోలు చేసింది.