డైమండ్‌‌‌‌పై నీరజ్, సాబ్లే గురి..ఇవాళ్టి నుంచి డైమండ్ లీగ్ ఫైనల్స్‌‌‌‌

డైమండ్‌‌‌‌పై నీరజ్, సాబ్లే గురి..ఇవాళ్టి నుంచి డైమండ్ లీగ్ ఫైనల్స్‌‌‌‌

బ్రస్సెల్స్‌‌‌‌: ఇండియా స్టార్ జావెలిన్‌‌‌‌ త్రోయర్‌‌‌‌‌‌‌‌, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్‌‌‌‌ నీరజ్ చోప్రా, స్టీపుల్‌‌‌‌ఛేజర్‌‌‌‌‌‌‌‌ అవినాశ్ సాబ్లే ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్స్‌‌‌‌లో సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. శుక్ర, శనివారాల్లో జరిగే ఈ ఈవెంట్‌‌‌‌లో 32 క్రీడాంశాల్లో వరల్డ్ బెస్ట్ అథ్లెట్లు పోటీ పడనున్నారు. 

పారిస్ గేమ్స్‌‌‌‌లో 11వ స్థానంతో సరిపెట్టిన సాబ్లే  తొలి రోజు అర్ధరాత్రి జరిగే స్టీపుల్‌‌‌‌ఛేజ్ ఫైనల్లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. రెండో రోజు జరిగే జావెలిన్‌‌‌‌ త్రో ఫైనల్లో నీరజ్ ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతున్నాడు.