
కోడేరు, వెలుగు : నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం లోని పోలీస్ స్టేషన్ ను గురువారం డీఐజీ ఎల్హెచ్ చౌహన్ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లో రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో స్నేహంగా మాట్లాడాలని చెప్పారు. విధి నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ మహేశ్, ఎస్ఐ సతీశ్, రైటర్ పాల్గొన్నారు.