
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ 2024-–25 విద్యా సంవత్సరానికి వర్సిటీ పాలిటెక్నిక్లతో పాటు, అనుబంధ పాలిటెక్నిక్లలో కింది డిప్లొమా కోర్సుల్లో అడ్మిషన్స్కు అప్లికేషన్స్ కోరుతోంది.
సీట్లు, కోర్సులు: డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లీష్ మీడియం): 630 సీట్లు, డిప్లొమా ఇన్ ఆర్గానిక్ అగ్రికల్చర్ (రెండేళ్లు, ఇంగ్లీష్ మీడియం): 60, డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ (మూడేళ్లు, ఇంగ్లీష్ మీడియం): 110 సీట్లు ఉన్నాయి.
అర్హత: పదో తరగతి ఉత్తీర్ణతతో పాటు పాలిసెట్-2024లో అర్హత సాధించి ఉండాలి. వయసు 2024 డిసెంబర్ 31 నాటికి 15 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి.
సెలెక్షన్: తెలంగాణ రాష్ట్ర పాలిసెట్-2024లో అగ్రికల్చర్ స్ట్రీమ్ కింద పొందిన ర్యాంకులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తులు: ఆన్లైన్లో జూన్ 25 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.600. మిగతా అభ్యర్థులందరికీ రూ.1200 అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. వివరాలకు www.diploma.pjtsau.ac.in వెబ్సైట్లో సంప్రదించాలి.