Anil Ravipudi: సారీ స్వామి ఆల‌స్య‌మైంది..తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న అనిల్ రావిపూడి

Anil Ravipudi: సారీ స్వామి ఆల‌స్య‌మైంది..తిరుమ‌ల శ్రీవారిని ద‌ర్శించుకున్న అనిల్ రావిపూడి

సినిమా వాళ్ళు ఎటువంటి శ్రీకారం చుట్టాలన్న శ్రీవారి దర్శనం చేసుకుంటాం అంటూ ముందుగానే మొక్కులు కోరుకుంటారు. ఇక సినిమా హిట్ అయిన తర్వాత తిరుమల కొండెక్కి మొక్కులు చెల్లించుకుంటారు. తరుచుగా ఎంతోమంది సెలబ్రెటీలు వెంకన్న సన్నిధికి వచ్చి దర్శించుకుని మరో కోరిక కూడా కోరుతూ వస్తు వెళ్లిపోతుంటారు.

తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి (Anil Ravipudi) తిరుమల శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంత‌రం తీర్ద ప్ర‌సాదాలు అందుకున్నాడు. అటుపై మీడియాతో మాట్లాడుతూ త‌న మొక్కు సంగ‌తి వెల్లడించాడు.'బాలకృష్ణతో తెరకెక్కించిన భ‌గ‌వంత్ కేస‌రి సినిమా త‌ర్వాత తిరుమల శ్రీవారిని ద‌ర్శించుకోవాల‌నుకున్నా.కానీ,అనుకోని కార‌ణాల వ‌ల్ల శ్రీవారి సన్నిధికి రావ‌డం ఆల‌స్య‌మైంది.ఇన్నాళ్ల‌కు ఆ మొక్కు చెల్లించాను. ఇప్పుడు మాత్రం మ‌న‌సు సంతోషంగా ఉంది.ఎప్పుడూ శ్రీవారిని ద‌ర్శించుకున్నా తెలియ‌ని ఎన‌ర్జీ వ‌స్తుంది.మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుందని' అనిల్ రావిపూడి తెలిపారు.'భ‌గ‌వంత్ కేస‌రి' మూవీ  బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను సాధించింది. 

అనిల్ రావిపూడి టాలీవుడ్ ఇండస్ట్రీలో కామెడీ సినిమాలకు కేరాఫ్ గా మారిపోయాడు.రాజమౌళి తరువాత ఇప్పటివరకు ఒక్క ప్లాప్ లేని దర్శకుడు అంటే అనిల్ రావిపూడి అనే చెప్పాలి.ఆయన చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్స్ గా నిలిచాయి.ప్రస్తుతం క్టరీ వెంకటేష్ తో F2, F3 తర్వాత మూడో సినిమాని ప్రకటించాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ (SVC 58) లో ఐశ్వర్య రాజేష్,మీనాక్షి చౌదరి వెంకీకి జోడిగా నటిస్తున్నారు.