
ప్రముఖ దర్శకుడు భారతీరాజా కుమారుడు, తమిళ నటుడు మరియు దర్శకుడు మనోజ్ భారతీరాజా (48) కన్నుమూశారు. మార్చి 25న చెన్నైలోని చెట్పేట్లోని తన నివాసంలో గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో హీరోలు కమల్ హాసన్ మరియు పవన్ కళ్యాణ్ తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసి, సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని ప్రకటించారు.
కమల్ హాసన్ X వేదికగా స్పందిస్తూ.. "నటుడు మరియు నా ఆత్మ మిత్రుడు దర్శకుడు భారతీరాజా తనయుడు మనోజ్ భారతిరాజా మరణవార్త తెలిసి నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. తమ ప్రియ కుమారుడిని కోల్పోయిన భారతీరాజా, ఆయన కుటుంబ సభ్యులు మరియు స్నేహితులకు నా ప్రగాఢ సానుభూతి" అని తెలిపారు.
நடிகரும் எனது ஆத்ம நண்பர் இயக்குநர் பாரதிராஜாவின் புதல்வனுமான மனோஜ் பாரதிராஜா மறைந்த செய்தி அறிந்து மிகுந்த அதிர்ச்சியும் வருத்தமும் அடைந்தேன்.
— Kamal Haasan (@ikamalhaasan) March 25, 2025
தனது அருமை மகனை இழந்து வாடும் பாரதிராஜா அவர்களுக்கும், அவரது குடும்பத்தாருக்கும், நண்பர்களுக்கும் எனது ஆழ்ந்த இரங்கலைத்…
నటుడు మరియు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తన సంతాపాన్ని తెలియజేశారు. శ్రీ భారతీరాజా కుటుంబానికి నా సానుభూతి మరియు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ తమిళంలో నోట్ రిలీజ్ చేశారు.
"ప్రఖ్యాత దర్శకుడు శ్రీ భారతీరాజా కుమారుడు శ్రీ మనోజ్ భారతీరాజా ఆకస్మిక మరణ వార్త విని నేను షాక్ అయ్యాను. శ్రీ మనోజ్ ఆత్మకు శాంతి చేకూరాలని నేను సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాను. తన కొడుకును కోల్పోయిన దుఃఖంలో ఉన్న శ్రీ భారతీరాజాకు దేవుడు బలాన్ని ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను" అని పవన్ కళ్యాణ్ నోట్ లో రాశారు.
திரு. பாரதிராஜாவின் குடும்பத்தினருக்கு ஆறுதலையும் ஆழ்ந்த இரங்கலையும் தெரிவித்துக் கொள்கிறேன்.
— Deputy CMO, Andhra Pradesh (@APDeputyCMO) March 25, 2025
- @PawanKalyan @pibchennai pic.twitter.com/4Lbvby2Sgt
మనోజ్ మృతదేహాన్ని ప్రస్తుతం చెన్నైలోని నీలంకరైలోని అతని తండ్రి భారతీరాజా నివాసంలో ఉంచారు. నగరంలోని బెసెంట్ నగర్ శ్మశానవాటికలో నేడు మార్చి 26న సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో మనోజ్ అంత్యక్రియలు జరుగనున్నాయి. మనోజ్ భారతీరాజా కు భార్య మరియు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.