Akhanda 2 : అఖండ-2 కోసం హిమాలయాల్లో డైరెక్టర్ బోయపాటి శ్రీను

Akhanda 2 :  అఖండ-2 కోసం హిమాలయాల్లో  డైరెక్టర్ బోయపాటి శ్రీను

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కుతోన్న  క్రేజీ ప్రాజెక్ట్ ‘అఖండ2 : తాండవం’. నాలుగేళ్ల తర్వాత ‘అఖండ’కు సీక్వెల్‌‌గా రూపొందుతోన్న చిత్రమిది.  ఇప్పటికే హైదరాబాద్‌‌లో ఓ షెడ్యూల్, కుంభమేళాలో మరో షెడ్యూల్‌‌ను పూర్తి చేశారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం  డైరెక్టర్ బోయపాటి  హిమాలయాల్లో రెక్కీ చేస్తున్నారు. హిమాలయాల్లోని అద్భుతమైన ప్రదేశాలలో కొన్ని  ఎక్స్‌‌ట్రార్డినరీ సన్నివేశాలను చిత్రీకరించడానికి ఆయన సిద్ధమవుతున్నట్టు శనివారం టీమ్ తెలియజేసింది. 

ఈ సన్నివేశాలు మూవీలో హైలైట్‌‌గా ఉంటాయని చెప్పారు. సంయుక్త మీనన్ హీరోయిన్‌‌గా నటిస్తున్న ఈ చిత్రంలో ఆది పినిశెట్టి కీలక పాత్ర పోషిస్తున్నాడు.  తేజస్విని నందమూరి సమర్పణలో 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా సందర్భంగా సెప్టెంబర్ 25న పాన్ ఇండియా వైడ్‌‌గా దీన్ని విడుదల చేయబోతున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.